శ్రీరాముడు రావణునితో యుద్ధం చేయుట

ఇంక రావణుడు తానే స్వయంగా రామలక్ష్మణులను చంపటానికి బయలు దేరాడు. అతని వెంట రథాలపై మహా పార్శ్వుడూ, మహెూదరుడూ, వీరూపాకుడు మొదలైనవారు బయలుదేరారు. అందరూ కలిసి, రామలక్ష్మణు లుండే ఉత్తర ద్వారం కేసి వెళ్ళారు.

రాక్షస సేన యుద్ధసన్నద్ధమై వస్తూండటం తెలిసి వానరులు కూడా యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. రావణుడు తన బాణాలతో వానరులను అపారమైన సంఖ్యలో చంపేస్తూ రాముడున్న చోటికి పోసాగాడు. అది చూసి సుగ్రీవుడు రాక్షస సేనల పైన కొండ రాళ్ళ వర్షం కురిపించి, రాక్షసులను కూడా అపార మైన సంఖ్యలో చంపసాగాడు. అప్పుడు విరూపాక్షుడు రథం మీది నుంచి ఒక ఏనుగు మీదికి మారి సుగ్రీవుడితో పోరాడ వచ్చాడు. సుగ్రీవుడతనితో భయంకరంగా యుద్ధం. చేసి మొదట ఏనుగునూ తరవాత విరూపాకుణ్ణి కూడా చంపేశాడు.

తన సైన్యాలు క్షీణించిపోతూ ఉండటం చూసి రావణుడు వానర సేనను నిర్మూలించమని మహోదరుణ్ణి ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడు మహోదరుడితో కూడా చాలా సేపు యుద్ధం చేసి చివర కతన్ని చంపాడు. వానరులు సింహనాదాలు చేశారు.

ఈ లోపల మహాపార్శ్వుడు అంగదుడి సేన పైకి వెళ్ళి, అంగదుడితో ద్వంద్వ యుద్ధం చేసి, కొంత సేపటికి అతని చేతిలో ప్రాణాలు విడిచాడు.

తన వెంట వచ్చిన ముగ్గురు మంత్రులూ చావటం చూసి రావణుడు మహాకోపంతో రాముడి పైకి వెళ్ళి, యుద్ధం ప్రారంభం చాడు. ఇద్దరూ ఒకరి పైన ఒకరు మహాస్త్రాలు ప్రయోగించుకున్నారు; ఒకరి అస్త్రాలను ఒకరు నిర్మూలించారు. చివరకు ఒకరి నొకరు బాణాలతో మర్మ స్థానాలలో కొట్టారు.

రాముడు రావణుణ్ణి తీవ్రంగా గాయ పరిచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లక్ష్మణుడు విల్లు ఎక్కు పెట్టి రావణుడి ధ్వజాన్నీ, వింటినీ విరగగొట్టాడు. విభీషడుబు గద తీసుకుని రావణుడి రథాశ్వాలను చంపాడు. రావణుడు రథం నుంచి కిందికి దిగి, తన తమ్ముడైన విభీషణుడి పైన ఒక శక్తిని ప్రయోగించాడు. లక్ష్మణుడా శక్తిని దారిలోనే తన బాణాలతో ఖండించాడు.

అది చూసి రావణుడు మరింత పెద్ద శక్తిని తీసి గిరగిరా తిప్పి, విభీషణుడి పై విసరబోయాడు. లక్ష్మణుడు రావణాసురుణ్ణి తన బాణాలతో పీడిస్తూ అతని ప్రయత్నా నికి అంతరాయం కలిగించాడు. రావణుడు మహాకోపంతో ఆ శక్తిని లక్ష్మణుడి పైకే విసిరాడు. అది లక్ష్మణుడి రొమ్ములో లోతుగా దిగబడింది. లక్ష్మణుడు పడిపోయాడు.

రాముడది చూసి భరించరాని ఆగ్రహంతో రావణుడి పైన అతి దారుణమైన బాణాలు వేసి తీవ్రంగా బాధించాడు. రావణుడు రాముడి ధాటికి తట్టుకోలేక పారిపోయాడు.

తరవాత రాముడు లక్ష్మణుడు పడి ఉన్న చోటికి వచ్చి, ఊపిరి బరువుగా తీస్తూ కొన ప్రాణంతో ఉన్న లక్ష్మణుణ్ణి చూసి అధైర్యపడిపోయాడు. లక్ష్మణుడికి ప్రాణభయం ఉండదని సుషేణుడు రాముడికి ధైర్యం చెప్పి, హనుమంతుడితో, “జాంబవంతుడు చెప్పిన ఓషధీ పర్వతానికి వెళ్ళి, దాని దక్షిణ శిఖరం పైన ఉండే నాలుగు రకాల ఓషధులూ తీసుకురా,” అన్నాడు.

హనుమంతుడు ఓషధీ పర్వతం దగ్గిరికి వెళ్ళాడు. కాని ఆ ఓషధు లేవో అతనికి తెలియలేదు. అందుచేత అతను మొత్తంగా శిఖరాన్నే తీసుకు పోదామనీ, లక్ష్మణుడికి కావలిసిన ఓషధి ఆ శిఖరం మీద ఎక్కడో ఉండకపోదనీ అనుకున్నాడు. అతనా పర్వత శిఖరాన్ని మూడు సార్లు అటూ ఇటూ కుదిరించి, పెకలించి తీసుకుపోయి యుద్ధభూమిలో వాలి, “నువు చెప్పిన మూలికలు గుర్తు తెలియక శిఖరాన్ని మొత్తంగా పెరికి తెచ్చాను,” అని సుషేణుడితో చెప్పాడు.

సుషేణుడు తనకు కావలిసిన ఓషధిని పెల్లగించి, నలిపి, దాని రసాన్ని లక్ష్మణుడి- ముక్కులో పిండాడు. దాని వాసన తగల గానే లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. రాముడు తన తమ్ముణ్ణి ఆలింగనం చేసు కుని ఆనందబాష్పాలు రాలుస్తూ, “లక్ష్మణా, నా అదృష్టం కొద్దీ నీవు చచ్చి మళ్ళీ బతికావు. నువ్వే పోయిఉంటే నాకు సీతదేనికి? యుద్ధంలో విజయం దేనికి?”అన్నాడు.

అది విని లక్ష్మణుడు, “బలహీనుడిలాగా ఎందుకిలా మాట్లాడతావు ? రావణుణ్ణి చంపి విభీషణుడికి పట్టం కడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవద్దా? నా కోసం దిగులు పడి నిరాశ చెందక, రావణుణ్ణి యుద్ధంలో చంపెయ్యి,” అన్నాడు.

లక్ష్మణుడిలా అనగానే రాముడు స్థిరచిత్తుడై విల్లు చేతబట్టాడు. ఈ లోపల రావణుడు కూడా మరొక రథ మెక్కి యుద్ధసన్నద్ధుడై వచ్చాడు. రాముడు నేల పైనా, రావణుడు రథం లోనూ ఉండి యుద్ధం ప్రారంభించారు.

అంతలో ఇంద్రుడి సారథి అయిన మాతలి దేవలోకం నుంచి ఒక దివ్యమైన రథాన్నీ, కవచాన్నీ, విల్లునూ, బాణాలనూ, శక్తినీ తీసుకుని రాముడున్న చోటికి వచ్చి, “రామా, దేవేంద్రుడు నీకోసం వీటినన్నిటినీ పంపాడు. ఈ రథంలో ఎక్కి నీవు రావణుణ్ణి వధించు,” అని చెప్పాడు. రాముడా రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అందులో ఎక్కాడు.

ఇద్దరూ ఒకరి పై ఒకరు మహాస్త్రాలు ప్రయోగించుకున్నారు. ఒకరి అస్త్రాలను మరొకరి అస్త్రాలు నిర్వీర్యపరచాయి. కొంతసేపు రావణుడు అతి భయంకరంగా యుద్ధం చేసి, రాముడికి చెయ్యి కాలూ. ఆడకుండా చేశాడు. అతను వజ్రాయుధంతో సమానమైన ఒక శూలాన్ని రాముడి పై ప్రయోగించే సరికి, రాముడు దాన్ని తన బాణాలతో నిరోధించలేక, ఇంద్రుడు పంపిన శక్తిని ప్రయోగించి ఆ శూలాన్ని ధ్వంసం చేశాడు.

ఆ తరవాత రాముడు విజృంభించి యుద్ధం చేస్తూంటే రావణుడు ఉక్కిరి బిక్కిరి అయి ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితిలో పడ్డాడు. అది చూసి రావణుడి సారథి తమ రథాన్ని యుద్ధరంగం నుంచి అవతలికి తోలుకు పోసాగాడు.

రావణుడికి తన సారథి పైన ఆగ్రహం వచ్చింది. “ఓరీ దుర్బుద్ధి, నేను పిరికి వాణ్ణి, అసమర్థుణ్ణి, ఆస్త్రాలు లేనివాణ్ణా, యుక్తిలేనివాణ్ణా? ఏమనుకుని నీ యిష్టం వచ్చినట్టు రథాన్ని యుద్ధరంగం నుంచి తోలుకు పోతున్నావు? నా కీర్తి కాస్తా ధ్వంసం చేశావే! నీకు శత్రువులేమన్నా లంచంపెట్టారా ఏమిటి? వెంటనే రథాన్ని వెనక్కు తోలు,” అన్నాడతను తన సారథితో.

“మహారాజా, నీ మేలు కోరి, నా విధిని పాటించి రథాన్ని పక్కకు తెచ్చాను. రాముడు చేసే యుద్ధానికి నీవు ప్రతి యుద్ధం చెయ్యటం లేదు. బ్రహ్మాండమైన యుద్ధం చేసి అలసిపోయి ఉన్నావు. గుర్రాలు కూడా డస్సి ఉన్నాయి. నీకూ వాటికీ కాస్త విశ్రాంతి లభించగలందుల కాపని చేశాను. రథం ఎప్పుడెలా నడపాలో తెలీకపోతే నేను సారథినే కాను. ఇప్పుడేం చెయ్య మంటావో చెప్పు, అలాగే చేస్తాను,” అన్నాడు రావణుడి సారథి.

రావణుడు మెత్తబడి, తన సారథిని కాస్త పొగడి, ” రాముడి కెదురుగా రథాన్ని తీసుకుపో!” అని చెప్పాడు. కొద్దిసేపటిలో రావణుడి రథం తిరిగి రాముడి ఎదటికి వచ్చి నిలబడింది.

ఆ సమయంలో రాముడు కూడా ఆమితంగా అలిసిపోయి, రావణుడితో యుద్ధం చేసే శక్తి లేని స్థితిలో ఉన్నాడు. అది కనిపెట్టి, యుద్ధం చూడవచ్చిన అగస్త్యుడు రాముణ్ణి సమీపించి, ” రామా, నీకు ఆదిత్య హృదయం చెబుతాను. అది జపించి, శక్తి వంతుడవై రావణుడితో యుద్ధం చెయ్యి,” అని రాముడికి ఆదిత్యహృదయం చెప్పాడు.

రాముడు దాన్ని మూడుసార్లు పఠించి, రెట్టింపైన బలం పొంది బాణం తీసుకుని రావణుడితో యుద్ధం సాగించటానికి ముందుకు వచ్చాడు.

అతను మాతలితో, ” ఈసారి రావణుణ్ణి నిశ్చయంగా చంపబోతున్నాను. నీవు రథాన్ని చాకచక్యంగా నడుపు. దేవేంద్రుడి రథ సారధివైన నీకు విశేషం చెప్ప నవసరంలేదు. ఏమాత్రం కూడా ఏమరు పాటు చెంద వద్దని జ్ఞాపకం చేస్తున్నానంతే!” అన్నాడు.

తన రథం మూలాన రేగిన దుమ్ము రావణుణ్ణి చుట్టుముట్టే లాగా మాతలి రథాన్ని రావణుడి కేసి తోలాడు. రావణుడు మండిపడి రాముడి పైన బాణాలు వేశాడు. రాముడు ఇంద్రుడు పంపిన విల్లూ, బాణాలూ తీసుకుని రావణుడితో యుద్ధం ఆరంభించాడు.

రామరావణ యుద్ధం ఎంత తీవ్రంగా సాగిందంటే ఉభయ పక్షాల వీరులూ యుద్ధం మానేసి ఆ ద్వంద్వ యుద్ధాన్ని చూడసాగారు. ఇద్దరూ తమ పరాక్రమాన్ని పూర్తిగా ప్రదర్శిస్తూ, అదే తమ తుది పోరాట మన్నట్టుగా యుద్ధం చేశారు.

ఇలా రామ రావణులు మహా భయంకరమైన యుద్ధం చేస్తుండగా, రాముడు ప్రయోగించిన అతి తీక్షణమైన బాణానికి రావణుడి శిరస్సు తెగి నేలపైన పడిపోయింది. కాని ఆ క్షణంలోనే రావణుడికి మరొక శిరస్సు పుట్టుకొచ్చింది. రాముడు దాన్ని కూడా ఖండించాడు. అది కిందపడే లోపుగా రావణుడికి మరొక శిరస్సు కనబడింది. ఈ విధంగా రాముడు రావణుడి తలను నూటఒక్కసారి ఖండించి కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోయాడు. తన వద్ద ఉన్న అమోఘమైన బాణాలన్నీ రావణుడి పై ఎందుకు వ్యర్థమయాయో అర్థంకాలేదు. రాముడికి

ఆ రామ రావణులు ఆ విధంగా, క్షణం విశ్రాంతి లేకుండా, ఏడు రాత్రులూ, ఏడు పగళ్ళూ పోరాటం సాగించారు. చూసి చూసి మాతలి రాముడితో, “వీణ్ణి చంపెయ్యక ఎందు కిలా తాత్సారం చేస్తు న్నావు ? వీడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించు,” అన్నాడు.

మాతలి ఆ మాట అనగానే రాముడొక మహాసర్పం కాటి బాణాన్ని పైకి తీశాడు. దేదీప్యమానంగా వెలిగే ఆ బాణాన్ని బ్రహ్మ ఒకప్పుడు ఇంద్రుడి కోసం తయారుచేశాడు. అది చాలా బరువైనది, ఈకలు గలది, వజ్రం లాగా అతి కఠినమై ఇతర ఆయుధాలను ఛేదించ గలది. రాముడా బాణాన్ని ఎక్కుపెట్టి మంత్రించి రావణుడి పైన వేశాడు. అది రావణుడి రొమ్మును ఛేదించి, అతని వీపులో నుంచి దూసుకుని బయటికి వచ్చే సింది. రావణుడు తన చేతిలో ఉండే ధనుర్బాణాలను వదిలేసి, ప్రాణాలుపోయి, రథం పై నుంచి నేల పైకి పడిపోయాడు.

అది చూసి హత శేషులైన రాక్షసులు పారిపోసాగారు. వానరులు చేతుల్లో చెట్లు పట్టుకుని, సింహనాదాలు చేస్తూ ఆ రాక్ష సులను తరిమారు. రావణుడు చావగానే దేవదుందుభులు మోగాయి, పుష్పవర్షం కురిసింది. రాముణ్ణి భూమి పైన వానరులతో బాటు, ఆకాశం లోని దేవతలు కూడా

పొగడారు. రాముడూ, సుగ్రీవుడూ, అంగదుడూ కృతకృత్యులై చాలా సంతృప్తి చెందారు. ఇతర వానర ప్రముఖులూ, విభీషణుడూ రామ లక్ష్మణుల చుట్టూ మూగి వారిని ప్రశంసించారు.

తన అన్న పోయినందుకు విభీషణుడు బాధపడ్డాడు. ఒక్క సీతాపహరణ కారణంగా రావణుడు నాశనమయాడే గాని, అతను అనేక విధాల మహాపురుషుడన దగినవాడు; గొప్ప పండితుడు: నిష్టాపరుడు. అసమాన శౌర్య పరాక్రమాలు గలవాడు.

అన్న పోయాడని బాధ పడుతున్న విభీషణుణ్ణి ఓదార్చుతూ రాముడు, “రావణుడు పిరికిచావు చావలేదు, వీరుడు లాగా పోరాడుతూ పోయాడు. యుద్ధంలో జయాప జయాలు దైవాధీనాలు. ఎంతటి మహావీరు డైనప్పటికీ శత్రువు చేతిలో మరణం పొందవచ్చు. వీరమరణం పొంది వీర స్వర్గం అందుకున్న వాడి కోసం శోకించ రాదు,” అన్నాడు.

రాముడి అనుమతిపై విభీషణుడు తన అన్నకు శాస్త్రోక్తంగా దహనక్రియలు చేయ బూనుకున్నాడు.

రావణుడు చచ్చాడని తెలియగానే అతని భార్యలు పెద్దపెట్టున ఏడుస్తూ, ఉత్తర ద్వారం కుండా వెలువడి, రావణుడి శవాన్ని వెతుక్కుంటూ వచ్చారు. చివరకు వారతని శవాన్ని చూసి, దాని పైన పడి, గుండెలు అవిసే లాగా ఏడ్చారు; విభీషణుడు చెప్పినట్టు సీతను రాముడి కిచ్చినట్టయితే ఇంత దురన్యాయం జరిగేది కాదని ఆక్రోశించారు. ” త్రిలోకాలనూ జయించి, దేవతలందరినీ అడలగొట్టి చివరి కొక మానవమాత్రుడి చేతిలో ప్రాణాలు వదిలావా ?” అని మందోదరి విలపించింది.

“ఈ ఆడవాళ్ళ నందరినీ ఇళ్ళకు పంపి నీ అన్నకు ఉత్తరక్రియలు చెయ్యి,” అని రాముడు విభీషణుడితో అన్నాడు. దుర్మార్గుడూ, అవినీతిపరుడూ అయిన తన అన్నకు తాను సంస్కారం చెయ్యటం యుక్తంగా ఉంటుందో ఉండదో నని విభీషణుడు ధర్మసందేహం లేవదీశాడు. యుక్తంగానే ఉంటుందని రాముడు చెప్పిన మీదట అతను అందుకు పూనుకున్నాడు.

బ్రాహ్మణులు చందనపు చెక్కలతో చితి పేర్చి దాని పైన ఒక గొంగళి పరిచారు. రావణుడి శవాన్ని అలంకరించి చితి పైన పడుకోబెట్టారు. విభీషణుడు చితికి చిచ్చు పెట్టాడు. తరువాత అతను తడిబట్టలతో నీళ్ళు వదిలి, స్త్రీ జనాన్ని లంకకు పంపించి, రాముడి వద్దకు వచ్చాడు.

యుద్ధం చూడవచ్చిన దేవదానవ గంధర్వాదులు రామ పరాక్రమం గురించీ, వానరులు చేసిన యుద్ధం గురించి మాట్లాడు కుంటూ తమతమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. రాముడు మాతలిని గౌరవించి, అతన్ని రథంతో సహా స్వర్గానికి పంపేశాడు.

తరవాత రాముడు కృతజ్ఞతాపూర్వకంగా సుగ్రీవుణ్ణి కౌగలించుకుని, లక్ష్మణుడితో సహా శిబిరానికి వెళ్ళాడు.

అతను లక్ష్మణుడితో, “ఇప్పుడు. వెంటనే జరగవలిసిన ముఖ్యమైన పని విభీషణుణ్ణి లంకా రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యటం. ఆ పని వెంటనే జరిపించు.” అని చెప్పాడు.

లక్ష్మణుడు వానరులకు సువర్ణకలశా లిచ్చి సముద్ర జలం తెప్పించాడు. అతను విభీషణుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టి ఆ జలంతో అభిషేకించాడు. విభీషణుడి మంత్రులూ, అతని పట్ల భక్తిగల రాక్షసులూ. సంతోషించారు. విభీషణుడు తన ప్రజలకు నచ్చే మాటలు చెప్పాడు. రాక్షస పౌరులు అతనికి రకరకాల వస్తువులు కానుకలుగా అర్పించారు. విభీషణుడు కూడా రామ లక్ష్మణులకు దివ్యమైన వస్తువులను కాను కలుగా ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *