సీతా దేవి అగ్ని ప్రవేశం చేయుట

రాముడు హనుమంతుణ్ణి పిలిచి, “హనుమంతుడా, నీవు రాక్షస రాజైన విభీషణుడి అనుమతితో లంకకు వెళ్ళి, రావణుడి ఇంట్లో ఉన్న సీత వద్దకు వెళ్ళి, నేను సుగ్రీవ లక్ష్మణులతో సుఖంగా ఉన్నాననీ, నా చేత రావణుడు చచ్చాడనీ చెప్పి, ఆమె ఏం చెబుతుందో తెలుసుకురా!” అన్నాడు.

హనుమంతుడు లంకా నగరం ప్రవేశించి, రావణుడి ఇంటికి వెళ్ళి, అక్కడ ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్య దుఃఖదేవత లాగా కూర్చుని ఉన్న సీతను సమీపించి, తన పేరు చెప్పుకుని, వినమ్రుడై నిల బడ్డాడు. సీత వెంటనే అతన్ని గుర్తు పట్ట లేదు. ఆమె తనను గుర్తించి సౌమ్యురాలు కాగానే హనుమంతుడు ఇలా అన్నాడు.

“వైదేహి, సుగ్రీవ లక్ష్మణ సమేతుడైన రాముడు కుశలంగా ఉన్నాడు. విభీషణుడి సహాయంతోనూ, వాసర బలాల తోనూ ఆయన శత్రువును చంపేశాడు. ఆయన కార్యం సిద్ధించింది. రావణుడు మరణించాడు. లంక వశమయింది. ‘ ఇప్పుడు నీవు రావణుడి ఇంట ఉన్నప్పటికీ విభీషణుడి అధీనంలో ఉన్నావు కనక నీ కేమీ భయం లేదు, నీవు సుఖంగా ఉండవచ్చు. విభీషణుడు నిన్ను చూడవస్తాడు’ అని రాముడు నీతో చెప్పమన్నాడు”

ఈ మాటలు విని సీత పరమానందం చెంది ఏమీ బదులు చెప్పలేక పోయింది. “ఏ మాలోచిస్తున్నావు? నాకేం చెబుతావు?”. అని హనుమంతుడు హెచ్చరించిన మీదట

ఆమె తడబడుడూ, ” ఈ సంతోష వార్త విని నా నోట మాట రావటంలేదు. నిన్నెలా ప్రశంసించాలో నాకు తెలియటంలేదు. నీ కివ్వదగిన కానుక కూడా ముల్లోకాల లోనూ కనబడదు,” అన్నది.

“అమ్మా, నిన్ను అశోకవనంలో నానా దుర్భాషలూ ఆడిన ఈ రాక్షస స్త్రీలను చిత్రహింస చేసి, చీల్చి చెండాడాలని ఉన్నది. అనుమతి అయ్యి,” అన్నాడు హనుమంతుడు.

“నాయనా, వీళ్ళు రావణుడి దాసీలు.యజమాని చెప్పినట్టు చెయ్యకపోతే శిక్ష పొందుతారు. వీరి పైన ఆగ్రహించటం భావ్యం కాదు. ఏ జన్మలోనో చేసుకున్న పాపానికి ఫలితంగా ఈ కష్టాలన్నీ పడ్డాను. ఈ రాక్షస స్త్రీలు ఏ తప్పూ చేయలేదు. ఒక వేళ చేసినా ఉదారులు క్షమించవచ్చు. తప్పులు చెయ్యని నా రెవరుంటారు?” అన్నది సీత.

“అమ్మా, నీవు అన్ని విధాలా రాముడికి తగిన భార్యవు. రాముడి వద్దకు వెళ్ళి ఏం చెప్పమంటావు?” అన్నాడు హనుమంతుడు.

“నాకు నా భర్తను చూడాలని ఉన్నది.” అన్నది సీత.

” రాముణ్ణి తప్పక చూస్తావులే,” అని చెప్పి హనుమంతుడు రాముడి వద్దకు తిరిగి వెళ్ళాడు. అతను రాముడితో, “ఎంతో దుఃఖితురాలై ఉన్న సీతను వెళ్ళి చూడు. నీకు విజయం లభించిందని విని ఎంతో సంతోషించి, ఆమె నిన్ను చూడగోరు తున్నది,” అన్నాడు.

రాముడి కంట నీరు వచ్చింది. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు ; సీత చాలా కాలంగా రావణుడింట ఉన్నది. ఆమెను స్వీకరిస్తే అపకీర్తి, నిర్దోషిని నిరాకరించటం తప్పవుతుంది.

అతను విభీషణుడి కేసి తిరిగి, “నీవు సీతను చక్కగా స్నానం చేయించి, శరీరానికి గంధపు పూతలు పూయించి, నగలతో అలంకరించి త్వరగా ఇక్కడికి తీసుకురా,” అన్నాడు.

విభీషణుడు వెళ్ళి తన స్త్రీల ద్వారా సీత కీ మాట చెప్పించాడు. సీత స్నానం చెయ్యకుండానే తన భర్తను చూస్తానన్నది, కాని విభీషణుడు, రాముడు చెయ్యమన్నట్టే చేస్తే బాగుంటుందని చెప్పాడు.

ఆడవాళ్ళు సీతకు తలంటి స్నానం చేయించి, శరీరానికి పూయ వలసిన పూతలన్నీ పూసి, మంచి నగలు పెట్టి, మంచి బట్టలు కట్టి, మంచి బట్ట పైన కప్పారు. చక్కని పల్లకీలో ఆమె నెక్కించి, అనేక మంది పరివారంగా పెట్టి విభీషణుడామెను రాముడున్న చోటికి తీసుకుపోయాడు.

సీతను ఎలా పరిగ్రహించటం, ఎలా త్యజించటం అని కొట్టుకుంటున్న రాముడికి, విభీషణుడు వచ్చి సీతను తెచ్చానని చెప్ప గానే సీత మళ్ళీ తన కంట పడుతుందన్న సంతోషం కూడా కలిగింది. అతను విభీష ణుడితో, “సీతను నా ముందుకు తీసుకురా!” అన్నాడు. విభీషణుడి ఆజ్ఞ పైన అతని భటులు అక్కడ మూగి ఉన్న వానరులను దూరంగా తోలేశారు.

రాముడు విభీషణుడితో, “ఎందుకు వీరందర్నీ తరిమేస్తున్నావు? వీళ్ళు పరాయి వాళ్ళు కారు, నా వాళ్ళే. ఆపత్సమయం లోనూ, స్వయంవరం లోనూ, పెళ్ళిళ్ళూ, యజ్ఞాలూ మొదలైనవి జరిగేటప్పుడూ స్త్రీలు ప్రజల మధ్యకు రావచ్చు. ఇది యుద్ధ భూమి, సీత నా వియోగంతో బాధపడుతున్నది. అందు చేత వీరంతా ఈ సమయంలో ఆమెను చూడవచ్చు,” అన్నాడు.

విభీషణుడు వెళ్ళి సీతను రాముడి ఎదటికి తీసుకువచ్చాడు. రాముడన్న మాటలలో లక్ష్మణ సుగ్రీవాదులకు సీత పైన ప్రేమ ఉన్న లక్షణాలు కనబడక విచారంకలిగింది. సీత సిగ్గు చేత ముడుచుకుపోతూ. రాముడి ఎదటికి వచ్చింది. ఆమె వెనుకగా విభీషణుడు వచ్చాడు. అంత మంది ఎదట తన ముఖం చూపలేక నీత చీరతో ముఖం కప్పుకుని, రాముడి కేసి చూస్తూ అతని కెదురుగా నిలబడింది.

రాముడు సీతను చూసి చాలా పరుషంగా ఇలా అన్నాడు.

“సీతా, పౌరుషవంతు డయినవాడు చేయగల పని చేశాను; శత్రువును చంపి, నిన్ను తిరిగి సంపాదించాను. శత్రువు నాకు చేసిన అవమానాన్ని కడిగేసుకున్నాను. నా శ్రమ ఫలించింది. నా ప్రతిజ్ఞ నేరవేరింది. సుగ్రీవుడి ప్రయత్నమూ, విభీష ణుడి ప్రయత్నమూ సఫల మయాయి. అయితే నే నిదంతా నీ కోసం చెయ్యలేదు, నా వంశానికి కలిగిన కళంకం పోగొట్టుకోవటానికి చేశాను. నాకు నీతో పని లేదు. నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు. నేనీ మాట బాగా ఆలోచించే చెబు తున్నాను. చాలా కాలంగా పరాయి వాడి దగ్గర ఉన్న దాన్ని అభిమానవంతు డెవడూ తిరిగి గ్రహించడు. నిన్ను ఎవరు ఇంత కాలంగా పతి వియోగంతో కుమిలి పోయి, చివరకు అతని నోట అమృత వాక్కులు వినవలిసిన సీత ఇలాటి మాటలు విని నిలువునా కంపించిపోతూ కన్నీరు కార్చసాగింది. అతని నోట అలాటి మాట లెన్నడూ విన్నది కాదు, అందుచేత అవమానంతో ఆమె తల మరింత వాలిపో యింది. ఆమె గద్గద కంఠంతో ఇలా అన్నది.

“వీరుడా, అజ్ఞాని తెలియని మాట లన్న విధంగా ఈ కర్ణ కఠోరమైన మాట లెందుకంటున్నావు? నీ వనుకున్నట్టుగా నేను ఏ దోషమూ చెయ్యలేదు. దుష్ట స్త్రీలను బట్టి స్త్రీ జాతి సంతటినీ శంకిస్తున్నావు. నీకు నా స్వభావం తెలుసు. అందుచేత అలాటి శంక విడిచిపెట్టు. నేను అధీనురాలినై ఉండగా రావణుడు నా శరీరాన్ని తాకితే ఆ తప్పు నాది కాదు. నా అధీనంలో ఉన్న మనస్సు మాత్రం నీ పైనే ఉన్నది. ఇంత కాలం కలిసి ఉన్న తరువాత కూడా నా స్వభావం నీకు తెలియకపోతే ఇక తెలిసే మార్గమే లేదు. హనుమంతుడు నన్ను వెతుకుతూ వచ్చినప్పుడే నన్ను విడిచిపెట్టినట్టు కబురు చేసి ఉంటే అప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉందును; నీకూ నీ మిత్రులకూ, ఇంత శ్రమ లేకపోయి ఉండును. నన్ను అగ్ని సాక్షిగా పెళ్ళాడటం. గాని, చాలా కాలంగా నన్నెరిగి ఉండటం గాని నీ కిప్పుడు ప్రమాణం కాలేదు.”

సీత రాముడితో ఈ మాట అని లక్ష్మీ ణుడితో, “లక్ష్మణా, ఇంత మాటపడి నాకు జీవించాలని లేదు. చితి పేర్పించు, నే నందులో ప్రవేశించి ప్రాణ త్యాగం చేస్తాను. పది మంది మధ్య భర్త చేత విడవబడిన భార్యకు మరో గతి లేదు,” అన్నది. లక్ష్మణుడు అతి దీనంగా రాముడి ముఖం కేసి చూసి, సీత అగ్ని ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకోవటాని కతను సుముఖుడే నని గ్రహించి, చితి పేర్చాడు.

తల వంచుకుని ఉన్న రాముడికి సీత మెల్లిగా ప్రదక్షిణం చేసి, మండుతున్న చితి వద్దకు వచ్చి, దేవ బ్రాహ్మణులకు నమ స్కారం చేసుకుని, చేతులు మోడ్చి, “నేను రాముణ్ణి తప్ప తలవకపోయి నట్టయితే, నన్ను గురించి రాముడికి కలిగిన శంక అబద్ధమైతే, నేను మనోవాక్కాయ కర్మల రాముణ్ణి అతిచరించక పోయి నట్టయితే సర్వ సాక్షి అయిన అగ్ని హెరాత్రుడు నన్ను సర్వ విధాలా కాపాడు తాడు గాక!” అని చెప్పి, అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో ప్రవేశించింది.

అది చూసి వానరులూ, రాక్షసుల కూడా హాహాకారాలు చేశారు. ఆ హాహా కారాలు వింటూ రాముడు బాధతో అశ్రువులు రాల్చాడు.

అప్పుడు కుబేరుడూ, యముడూ, దేవేంద్రుడూ, వరుణుడూ, శివుడూ, బ్రహ్మా కాంతివంతమైన విమానాలలో లంకకు చేరి రాముడి వద్దకు వచ్చారు. వాళ్ళు చేతులెత్తి రాముడితో, “లోక కర్తవు, జ్ఞానవ తారుడివి, సీత అగ్నిప్రవేశం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు ?” అన్నారు.

“నేను దశరథుడి కొడుకు ననే అను కుంటున్నాను. నేను పరమార్థంలో ఎవణ్ణా ఎందుకు పుట్టానో బ్రహ్మ చెప్పాలి,”. అన్నాడు రాముడు.

“నీవు సాక్షాత్తూ నారాయణుడివి. సీత లక్ష్మీదేవి. రావణ సంహారం కోసం ఈ భూలోకంలో మానవ జన్మ ఎత్తావు! రావణవధ చేశావు! ఇక వైకుంఠానికి రా!! అన్నాడు బ్రహ్మ.

బ్రహ్మ ఇలా అనగానే అగ్ని హోత్రుడు సీత నెత్తుకుని చితి నుంచి లేచి వచ్చాడు. అగ్నిహోత్రుడు మానవాకారం ధరించి పైకి లేవగానే చితి చెల్లాచెదరై పోయింది.

అగ్ని సీతను తెచ్చి రాముడి కిస్తూ, “ఇదుగో నీ సీత. ఈవిడ ఏ పాపమూ ఎరగదు. ఈమె మనస్సు ఒక్క క్షణమైనా నీ పై నుంచి మరొకరి పైకి మరల లేదు. ఆమె మనస్సు తన కేసి తిప్పాలని రావ ణుడు విశ్వప్రయత్నాలు చేశాడు. కాని అవేవి ఫలించ లేదు. కనక ఈమెను పరిగ్రహించు. ఇది నా అజ్ఞ,” అన్నాడు.

“సీత ఏ పాపమూ ఎరగదని నాకు తెలుసును. కాని సదాచారాన్ని గౌరవించి, ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంటే చూస్తూ ఊరుకోవలిసి వచ్చింది. లేకపోతే లోకులు నన్ను మోహాంధుడి కింద కట్టేస్తారు. అగ్ని కంటె కూడా పవిత్రమైన సీతను రావణుడేం చెయ్యగలడు? ఇప్పుడు సీత పాపరహిత అని మూడు లోకాలకు వెల్లడయింది. నే నామెను తప్పక పరిగ్రహిస్తాను,” అని రాము ఉన్నాడు.

అప్పుడు శివుడు రాముడితో, “రామా, స్వర్గం నుంచి దశరథుడు విమానంలో వచ్చాడు చూడు. ఆయన మాట నిజం చేసినందు వల్ల ఆయనకు ఇంద్ర లోకం లభించింది,” అన్నాడు.

రామలక్ష్మణులు విమానంలో వచ్చిన దశరథుణ్ణి చూసి ఆయనకు నమస్కారం చేశారు. దశరథుడు రాముణ్ణి దగ్గరికి తీసు కుని కౌగిలించుకుని, “నాయనా, నిన్ను ఎడబాసిన నాకు స్వర్గ సుఖాలు కూడా తృప్తికరంగా లేవురా. నిన్ను అరణ్యానికి పంపా నన్న మాటా, కైకేయి అన్న మాటలూ నన్నింకా బాధిస్తూనే ఉన్నాయి. అయితే, నీ పట్టాభిషేకానికి విఘ్నంకలి గించింది దేవతలేననీ, రావణ సంహారం కోరి వారా పని చేశారని నాకు తెలియ వచ్చింది. నీ వనవాసం పద్నాలుగేళ్ళూ తీరిపోయింది. ఇక నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యాభిషేకం చేసుకో. నిన్ను చూసి కౌసల్య చాలా సంతోషిస్తుంది,” అన్నాడు. అయన లక్ష్మణుడికి సీతకూ కూడా కొన్ని హితవాఖ్యాలు చెప్పాడు.

దశరథుడు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాక ఇంద్రుడు రాముణ్ణి శ్లాఘించి, ఏదైనా వరం కోరుకో మన్నాడు. తన కోసం యుద్ధంలో చనిపోయిన వానర భల్లూకా లందరినీ తిరిగి బతికించమని రాముడు కోరాడు. ఇంద్రుడలాగే చేశాడు. చావగా మిగిలిన వానరులు చచ్చిన వానరులు తిరిగి బతకటం చూసి అత్యాశ్చర్యం చెందారు. తరువాత దేవతలంతా వెళ్ళిపోయారు.

రాముడా రాత్రి సుఖంగా నిద్రపోయాడు. మర్నాడు విభీషణుడు వచ్చి రాముణ్ణి స్నానం చేయిస్తాననీ, నగలూ, బట్టలూ ధరింపజేస్తా ననీ చెప్పి ఆహ్వానించాడు.

“అలాటి వన్నీ సుగ్రీవుడు మొదలైన వారికి చేయించు. పద్నాలుగేళ్ళు పూర్తి అయిన మర్నాడు నేను తిరిగి రాకపోతే ప్రాణం వదులుతానని నా తమ్ముడు శపథం చేశాడు. వాడన్నంత పనీ చేస్తాడు. అలాటప్పుడు నాకు స్నానాలూ, వస్త్రాభరణాలూ దేనికి? నేను వెంటనే అయోధ్యకు వెళ్ళాలి,” అని రాముడన్నాడు.

“ఒక్క రోజులో నేను నిన్ను పుష్పక విమానం మీద అయోధ్యకు చేర్చగలను. ఇంతకు ముందు కుబేరుడు వచ్చినా కూడా, అతని విమానం అతని కిచ్చెయ్యకుండా, నీ కోసం ఉంచాను. నేను నీకూ, నీ తమ్ము డికి, నీ భార్యకూ ఇచ్చే అతిథ్యం తీసుకుని మరీ వెళ్ళాలని నా ప్రార్ధన.” అన్నాడు. విభీషణుడు.

“నీ భక్తే నాకు చాలు. నా మనస్సు భరతుణ్ణణ్ణి, నా తల్లులనూ చూడాలని తహతహ లాడుతున్నది. నా వనవాసం పూర్తి అయింది. భరతుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. నే నిక్కడ ఎలా ఉండను ? ఈ పుష్పక విమానం ఇచ్చినదే నాకు పదివేలు,” అన్నాడు రాముడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *