లక్ష్మణుడు సీతను అరణ్యంలో విడిచి వచ్ఛుట

అగస్త్యుడు రాముడికి వాలి సుగ్రీవుల కథ ఇలా చెప్పాడు.

మేరుపర్వతం మీది మధ్య శిఖరం దేవతలకు కూడా పవిత్రమైనది. దాని మీద విశాలమైన బ్రహ్మసభ ఉన్నది.

ఒకసారి బ్రహ్మ యోగాభ్యాసం చేస్తూ, కంటి నుండి కారిన నీటిని విదిల్చేసరికి, దాని నుంచి ఒక వానరుడు పుట్టాడు. బ్రహ్మ ఆ వానరుణ్ణి కొంత కాలంపాటు తన వద్దనే ఉండమనీ, మేరుపర్వతం మీది దుంపలూ, పళ్ళూ తింటూ ఉండమనీ అన్నాడు. అది మొదలు ఆ వానరుడు పగలల్లా చెట్ల మీద సంచరించి, సాయంకాలం కాగానే మంచి మంచి పూలూ, పళ్ళూ తీసుకుని బ్రహ్మ వద్దకు వస్తూండేవాడు.

ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడా వానరుడికి దాహం కలిగింది. అతను మేరుపర్వతం యొక్క ఉత్తర శిఖరానికి వెళ్ళాడు. అక్కడ అనేక పక్షులతో కూడిన సరస్సాకటి కనిపించింది. వానరుడు తన శరీర మంతా ఒక్కసారి విదుల్చుకుని, నీటి దగ్గిర కూర్చుని, తన దాహం తీర్చుకునేటందుకుగాను నీటిలోకి తొంగి చూసే సరికి, అందులో అతని ప్రతిబింబం కని పించింది. నీటిలో తన శత్రువైన మరొక వానరుడు దాగి ఉన్నాడనీ, వాడి అంతు కనుక్కోవాలనీ అనుకుని వానరుడు నీటి లోకి చెంగున దూకి, ఎంతో వెతికాడు. లోపల మరొక వానరుడు కనిపించకపోయే సరికి అతను ఒడ్డుకు తిరిగి వచ్చాడు.

ఒడ్డుకు చేరుతూనే ఆ వానరుడు ఒక అందమైన ఆడదిగా మారిపోయాడు. జగ న్మోహనమైన రూపంతో ఆ ఆడది అక్కడే కూర్చుని ఉండగా, ఇంద్రుడూ, సూర్యుడూ బ్రహ్మను చూసి వెళ్ళిపోతూ అటు గా వచ్చారు. ఇద్దరి కళ్ళూ ఒకసారే ఆమె పైన పడ్డాయి. ఇద్దరికీ ఆమె పైన మోహం కలిగింది. వారిద్దరి పల్లా ఆమె గర్భవతి అయి, వాలి సుగ్రీవులను కన్నది. ఇంద్రుడు తన కొడుకైన వాలికి బంగారు తామరల మాలను కానుకగా ఇచ్చాడు. సూర్యుడు. తన కొడుకైన సుగ్రీవుడికి హనుమంతుణ్ణి స్నేహితుడుగా నిరూపించాడు.

తరువాత ఆ వానరుడికి స్త్రీ రూపం పోయి. తిరిగి మామూలు రూపం వచ్చేసింది. అతనే తన కొడుకులిద్దరినీ పెంచాడు. అతనే ఋక్షరజసుడు. బ్రహ్మదేవుని ఆజ్ఞపైన ఋక్షరజసుడు తన కొడుకులిద్దరినీ తీసుకుని వానరుల నగరమైన కిష్కింధకు వెళ్ళాడు. అక్కడ అతను రాజ్యాభిషేకం చేసుకుని, సప్తద్వీపాలలోనూ ఉండే వానరులందరికి రాజయాడు.

“రామా, వాలి సుగ్రీవులకు తండ్రి, తల్లి కూడా ఋక్షరజసుడే,” అని చెప్పి అగస్త్యుడు. ఆ కథ ముగించాడు.

రామపట్టాభిషేకం జరిగాక చాలా రోజులపాటు వచ్చినవారందరికీ సుఖంగా గడిచింది. అనంతరం ఒకరొకరే వెళ్ళిపోసాగారు. రాముడు అందరికీ తన కృతజ్ఞత తెలుపుకుని, తగినవిధంగా సత్కరించి సాగనంపాడు. భరతుడు వెంటరాగా జనక మహారాజూ, లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకుని కేకయమహారాజు వెళ్ళిపోయారు. భరతుడి ఆహ్వానం పైన వచ్చిన కాశీరాజు ప్రతర్దనుడూ ఇతర రాజులూ కూడా తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు.

రాముడి వెంట వచ్చిన వానరులూ, రాక్షసులూ రెండు నెలలపాటు అయోధ్యలో సుఖంగా గడిపి వారు కూడా బయలుదేరారు. తనకు యుద్ధంలో తోడ్పడిన సుగ్రీవాంగద హనుమంతాదులను రాముడు చక్కగా సత్కరించాడు, అలాగే విభీషణుడికీ, అతని రాక్షసులకూ సన్మానాలు చేశాడు. వారందరూ బయలుదేరి కిష్కింధకూ, లంకకూ వెళ్ళిపోయారు.

తరవాత రాముడు సీతతో వనవిహారాలు చేస్తూ, మిత్రులతో గోష్ఠి జరుపుతూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు. సీతలో గర్భ చిహ్నాలు కనిపించాయి. రాము డామెతో, “సీతా, గర్భిణివిగా ఉన్నావు గదా, నీ కేమైనా కోరికలుంటే చెప్పు, తీరుస్తాను,” అని ఒకనాడన్నాడు.

సీత చిరునవ్వుతో ముఖం పంచుకుని, “నాకు గంగాతీరాన ఋషులు ఆశ్రమాలు చూసి వారి కందమూల ఫలాలు తిని, అక్కడ చెట్ల కింద విహరించాలని ఉన్నది.” అన్నది.

రాముడు, “అలాగే చేతువుగాని, రేపే నిన్ను అక్కడికి పంపుతాను,” అన్నాడు.

సీతతో ఈ మాట అని అతను తన మిత్రుల మధ్యకు వచ్చి హాస్యపు కథలు చెప్పుకుంటూ కూర్చుని, భద్రుడనే వాణ్ణి చూసి, ” అయితే, భద్రా, నన్ను గురించి, సీత గురించి, నా తల్లులను గురించి, తమ్ములను గురించి ప్రజలు ఏమను కుంటూంటారు?” అని అడిగాడు.

భద్రుడు చేతులు జోడించి, “ప్రజలు అనేకరకాలగా చెప్పుకుంటారు. వాళ్ళు జాస్తిగా మాట్లాడుకునేది రావణసంహారం గురించి,” అన్నాడు.

భద్రుడేదో దాస్తున్నాడని రాముడికి అనుమానం వేసింది. ” భద్రా, ఉన్నమాట చెప్పు. మంచిదయినా, చెడ్డదయినా దాచకు,” అన్నాడతను.

“సముద్రానికి సేతుపు కట్టావనీ, రావణుని సమూలంగా నాశనం చేశావనీ ప్రజలు నిన్ను గురించి గొప్పగా చెప్పు కుంటారు. నిన్ను చూసి చాలా గర్వపడ తారుకూడా. కాని రావణుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని లంకకు తీసుకుపోయి, అంతకాలం తన ఆధీనంలో ఉంచుకున్న సీతను మళ్ళీ తెచ్చుకున్న నీకు మంచి చెడ్డలు తెలియవంటున్నారు. రేపు తమ భార్యలకేమైనా జరిగినా తాము చచ్చినట్టు భరించవలిసిందే గదా అంటున్నారు. యథా రాజా తథా ప్రజా అన్నారు గద. ఎక్కడికి పోయినా జనం గుంపులు గుంపు లుగా కూడి ఈ మాటలే చెప్పుకుంటున్నారు,” అన్నాడు భద్రుడు.

రాముడు లోపల తీవ్రంగా బాధపడుతూ మిగిలిన మిత్రులతో, “ఈ మాట నిజ మేనా?” అన్నాడు.

అందరూ తలలు వంచుకుని, నిజమేనని చెప్పారు.

రాముడు వారందరినీ పంపేసి, సమీపంలో ఉన్న ద్వారపాలకుణ్ణి పిలిచి, “లక్ష్మణుణ్ణి భరతశత్రుఘ్నులనూ పిలుచుకురా,” అన్నాడు. త్వరలోనే వారు ముగ్గురూ రాముడి వద్దకు వచ్చారు. కాంతి లేని ముఖంతో, కన్నుల నీరు కారుస్తూ రాముడు తన తమ్ములను ఆలింగనం చేసుకుని, ఆసనాల మీద కూర్చోబెట్టి, వారికి సీత గురించి తాను పొందిన జనాపవాదం గురించి తెలిపాడు.

“సీత నిర్దోషురాలని అగ్ని ఇతర దేవతలూ చెప్పారు. నా అంతరాత్మలో కూడా అలాగే అనిపించింది. లక్ష్మణా, ఇది నీ ఎదట గదా జరిగింది? అందుచేతనే సీతను అయోధ్యకు తెచ్చాను. కాని ఈ అపవాదు భరించటం చాలా బాధగా ఉంది. ప్రాణాలనూ మిమ్మల్ని అయినా వదులుతాను గాని అపకీర్తిని సహించలేను. సీతను విడవటమనగా ఎంత? ఈ అపవాదును మించిన దుఃఖం నా కుండబోదు. అందుచేత లక్ష్మణా రేపు తెల్లవారుజామున సీతను రథం మీద తమసానదీ తీరాన, వాల్మీకి ఆశ్రమప్రాంతంలో అరణ్యంలో పదిలిపెట్టిరా. నా మాటకు ఎదురు చెప్పకు, సీతను గురించి ఏమీ అనకు. అంటే నా పైన ఒట్టే! సీత ఋషుల ఆశ్రమాలను చూడాలని కోరింది. ఆ కోరిక తీరుతుంది,” అన్నాడు రాముడు.

ఈ మాటలు చెప్పి అతను బాధగా విడుస్తూ అంతఃపురంలో ఉ వెళ్ళిపోయాడు.

మర్నాడు తెల్లవారుతూనే లక్ష్మణుడు సుమంత్రుడి వద్దకు వెళ్ళాడు. అతని వాలకం దీనంగా ఉన్నది. నోరెండిపో తున్నది. అతను సుమంత్రుడితో, “సీతను మునుల ఆశ్రమాలకు తీసుకుపొమ్మని రాముడి ఆజ్ఞ అయింది. నేనూ, సీతా ఇప్పుడే బయలుదేరుతున్నాం. వెంటనే రథం సిద్ధం చెయ్యి. సీత కోసం రాజభవనం నుంచి మెత్తని ఆసనం తెచ్చి రథంలో అమర్చు.” అన్నాడు.

సుమంత్రుడు రధాన్ని ఆయత్తం చేసి తేగానే లక్ష్మణుడు సీత వద్దకు వెళ్ళి, “అమ్మా, ఆశ్రమాలు చూడాలని ఉన్నట్టు రాజుగారితో అన్నావుట. రాజుగారి ఆజ్ఞ అయింది. గంగాతీరాన గల ఆశ్రమాలకు పోదాం, బయలుదేరు. మా అన్న ఆజ్ఞ ప్రకారం నేను కూడా నీ వెంట వస్తున్నాను,” అన్నాడు.

సీత ఈ మాటలకు పరమానందం చెంది, వెలగల బట్టలూ, రత్నాలూ, ఆభరణాలూ మునిపత్నుల కోసం తీసుకుని, లక్ష్మణుడి వెంట రథం మీద బయలుదేరింది. రథం వేగంగా పోతూంటే సీతకు దుశ్శకునాలు కనిపించాయి. ఆ సంగతి లక్ష్మణుడితో చెప్పి, “అత్తలూ వాళ్ళూ క్షేమంగా ఉన్నారు కద!” అన్నది. లోపల గుండె గుబగుబలాడుతున్నప్పటికీ, లక్ష్మణుడు పైకి నవ్వుతూ, “వారంతా క్షేమంగానే ఉన్నారు,” అన్నాడు.

రాత్రి అయే సరికి రథం గోమతీతీర్ధం చేరింది. ఆ రాత్రి అక్కడ గడిపి, తెల్లవారి బయలుదేరి, మధ్యాహ్నాని కల్లా గంగా తీరానికి చేరుకున్నారు. గంగను చూడగానే లక్ష్మణుడికి దుఃఖం ఆగలేదు. అది చూసి, ‘ఇదేమిటి, లక్ష్మణా? ఎందుకేడుస్తున్నావు. ఎంతో కాలంగా కోరుకున్న నా కోరిక తీరిందని నేను సంతోషిస్తుంటే, నీ దుఃఖంతో నా ఆనందాన్ని పాడుచేస్తున్నావెందుకు? నన్ను వేగంగా గంగ దాటించి మునుల ఆశ్రమాలకు తీసుకుపో. మునుల భార్యలకు ఈ కానుకలన్నీ ఇస్తాను. అక్కడ ఈ రాత్రి గడిపి, రేపుదయం అయోధ్యకు తిరిగి పోదాం. రాముణ్ణి ఎప్పుడు మళ్ళీ చూస్తానా అని నాకూ తహ తహగానే ఉన్నది,” అని సీత అన్నది.

లక్ష్మణుడు కళ్ళు తుడుచుకుని దగ్గిరలో ఉన్న పడవ వాళ్ళను పిలిచి, పడవ ఏర్పాటు చేసి, దాని మీద సీతతో సహా గంగ దాటాడు. రథంతో సహా సుమంత్రుడు ఇవతలి ఒడ్డునే ఉండిపోయాడు.

అవతలి ఒడ్డు చేరాక లక్ష్మణుడు సీతకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ, “సీతా, మా అన్న నా గుండెలో శూలం గుచ్చేశాడు. ఇంత పాపిష్టి పని చేసే కన్న నేను చచ్చిపోయినా బాగుండిపోను,” అంటూ దుఃఖవివశుడై కూలబడిపోయాడు.

సీత అతని స్థితి చూసి కంగారు పడి, “లక్ష్మణా, నీ మాటలు నాకేమీ అర్ధం కావటం లేదు. నువ్వేదో ఉద్రేకంలో ఉన్నట్టున్నావు. నీ బాధకు కారణ మేమిటో కాస్త స్పష్టంగా చెప్పు. లేకపోతే మీ అన్న మీద ఒట్టే!” అన్నది.

అప్పుడు లక్ష్మణుడు సీతతో, ” అమ్మా, మా అన్న స్నేహితులతో కబుర్లు చెబుతూ నిన్ను గురించి భయంకరమైన లోకాపవాదు విన్నాడు. ఆ అపవాదు నీ చెవుల పడరానిది. దానితో మా అన్న కుమిలిపోయి నిన్ను వదిలిపెట్టేశాడు. నీ వల్ల ఏ దోషమూ లేదని మా అన్నకూ తెలుసు, నాకూ తెలుసు. అయినా అపవాదుకు వెరచి ఇలా చేశాడు. నిన్నిక్కడే విడిచిపెట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్ళాలి. ఇది రాజాజ్ఞ. నువు మనస్సును అధికంగా కష్ట పెట్టుకోక, పుణ్యప్రద మైన ఈ ముని ఆశ్రమాలలో ఉండు. వాల్మీకిమహాముని మా తండ్రికి ఆప్తస్నేహితుడు. ఆయనను ఆశ్రయించి సుఖంగా ఉండు,” అన్నాడు.

ఈ మాటలు విని సీత ఒక్క క్షణంపాటు దిమ్మరపోయినట్టయింది. తరువాత ఆమె తెప్పరిల్లి, దీనంగా ఏడుస్తూ, “లక్ష్మణా, నేను కష్టాలు పడటానికే పుట్టాను. పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. ఏ దంపతులకో ఎడబాటు కలిగించి ఉంటాను. అరణ్యవాసమప్పుడు, రాముడు దగ్గిర ఉండి నన్ను ఓదార్చుతున్నా, నేను దుఃఖిస్తూనే ఉండేదాన్ని అలాటిది రాముడు వెంట లేని ఈ అరణ్య వాసం ఎలా ఉంటుందో ఆలోచించు. నా దుఃఖం ఎవరితో చెప్పుకునేది? నిన్ను నీ భర్త ఎందుకు వదిలేశాడని మునులు అడిగితే ఏం చెప్పను? ఈ గంగానదిలో పడి చావవచ్చు, కాని అందువల్ల మీ వంశం. అపహాస్యంపాలు కావచ్చు. మీ అన్నగారి ఆజ్ఞ నిర్వర్తించావు, ఇక నువు వెళ్ళు, నాయనా, అత్తలందరికీ నా నమస్కా రాలు చెప్పు, రాజుగారి క్షేమమడిగాననీ,ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేశాననీ చెప్పు. ఆయనకు వచ్చిన అపవాదును పోగొట్టటం నా విధి. ధర్మంగా రాజ్యపాలన చేస్తూ, తమ్ముళ్ళనూ, ప్రజలనూ ఒకే విధంగా చూస్తూ, లోకంలో సాటిలేని కీర్తి సంపాదించమని కోరానని ఆయనతో చెప్పు,” అన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *